• అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక రాజాధి రాజా యోగి రాజా పర బ్రహ్మ 
    శ్రీ శ్రీ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై 
    శ్రీ షిర్డీ సాయిబాబా మందిరం, నిజాంపేట్. హైదరాబాద్
  • సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాస్రావిణం తిక్తమప్య ప్రియం తం
    తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథమ్

శ్రీ షిర్డీ సాయిబాబా మందిరం, నిజాంపేట్. హైదరాబాద్

image

నిజాంపేట్, మంజీరా వాటర్ ట్యాంక్ దగ్గర గల శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయాన్ని ఆలయ వ్యవస్థాపకులైన శ్రీ ఏనుగుల సురేందర్ రెడ్డి అనురాధ దంపతులు 1985 వ సంవత్సరం లో వారి పొలములో సాయిబాబా విగ్రహాన్ని ప్రతిష్టించి ఆలయాన్ని స్థాపించడం జరిగింది, సాయిబాబా విగ్రహంతో పాటు శ్రీ సీతారాములు వారి విగ్రహం, శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి విగ్రహం, శ్రీ ఆంజనేయ స్వామి వారి  విగ్రహం, లక్ష్మీదేవి విగ్రహం, శ్రీ ఎల్లమ్మ అమ్మవారి విగ్రహం,గణపతి విగ్రహాలను ప్రతిష్టించి ఆనాటి నుండే పూజ పునస్కారాలు నిర్వహిస్తూ వచ్చారు. నాటి నుండే  ప్రతి గురువారం అన్నదాన కార్యక్రమం,పల్లకి సేవ  ఇంకా పూజ పునస్కారాలు నిర్వహిస్తూ వస్తున్నారు.

కాల క్రమేణా భక్తుల సహాయ సహకారాలతో ఆలయాన్ని అబివ్రుద్ది చేసి నేటికీ  ప్రతి గురువారం ఇంకా పర్వ దినాలలో భారీ ఎత్తున అన్నదానము, ప్రతీరోజు పూజాపురస్కారలను నిర్వహించడం జరుగుతుంది. వీటితో పాటు ట్రస్ట్ తరుపున సేవ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది.

సేవలు / పూజ కార్యక్రమాలు

అభిషేకం

అభిషేకం

ప్రతి నిత్యం ఉదయం సాయిబాబా వారికి అభిషేకం జరుపబడును.

హారతులు

హారతులు

ప్రతి నిత్యం షిర్డీ లో వలెనే నిత్యా హారతులు జరుపబడును 

అన్నదానం

అన్నదానం

ప్రతి గురువారం మందిరం ఆవరణలో అన్నదాన కార్య క్రమం జరుపబడును. 

పల్లకి సేవ

పల్లకి సేవ

ప్రతి గురువారం అద్భుతంగా బాబా వారికి పల్లకి సేవ జరుపబడును 

ట్రస్ట్ సభ్యులు / కమిటి మెంబెర్స్

శ్రీ ఏనుగుల సురేందర్ రెడ్డి గారు

ఆలయ వ్యవస్థాపకులు & మేనేజింగ్ ట్రస్టీ 

శ్రీమతి ఏనుగుల అనురాధ గారు

ట్రస్ట్ సభ్యులు

శ్రీ ఏనుగుల రాజ శేఖర్ రెడ్డి గారు

ట్రస్ట్ సభ్యులు

శ్రీ ఏనుగుల చంద్ర శేఖర్ రెడ్డి గారు

ట్రస్ట్ సభ్యులు

శ్రీ శేరికారి గంగారెడ్డి గారు

ట్రస్ట్ సభ్యులు

శ్రీ చౌదరిగారి మహిపాల్ రెడ్డి గారు 

ట్రస్ట్ సభ్యులు

శ్రీ సుర్వి రాము గౌడ్ గారు

ట్రస్ట్ సభ్యులు